యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను
నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.
మీకా చేసికొనినదానిని, అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకొని, సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతముచేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి.
సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండని చెప్పెను . అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి -మరణ శ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా
తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా , ఫిలిష్తీయుల దేశములోనుండియు యూదా దేశములోనుండియు తాముదోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశ మంతట చెదిరి అన్న పానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు