కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీయుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయులయొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును
వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోను లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి-మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.
అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి , గాజావారి నిమిత్తము ఒకటి , అష్కెలోను వారి నిమిత్తము ఒకటి , గాతువారి నిమిత్తము ఒకటి , ఎక్రోనువారి నిమిత్తము ఒకటి .
అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు .
గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడై పోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును.
అష్కెలోను దానిని చూచి జడియును , గాజా దానిని చూచి బహుగా వణకును , ఎక్రోనుపట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజా రాజు లేకుండపోవును , అష్కెలోను నిర్జనముగా ఉండును .
అష్డోదులో సంకరజనము కాపురముండును , ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను.
వారి నోటనుండి రక్తమును వారికను తినకుండ వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగానుందురు , మన దేవునికి వారు యూదా వారిలో పెద్దలవలె నుందురు , ఎక్రోనువారును యెబూసీయులవలె నుందురు.