కాగా పొందగోరువానివలననైనను , ప్రయాసపడువాని వలననైనను కాదు గాని ,కరుణించు దేవునివలననే అగును.
కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠినపరచును .
అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ? ఆయన ఇకను నేరముమోప నేల అని నీవు నాతో చెప్పుదువు .
ఆయన నా మంచితన మంతయు నీ యెదుట కనుపరచెదను ; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను . నేను కరుణించు వాని కరుణించెదను , ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెద ననెను .
అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము , దయ , దీర్ఘ శాంతము , విస్తారమైన కృపా సత్యములుగల దేవుడైన యెహోవా .
ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు , దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను .
దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.
తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి , వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోప ముంచడు .