తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను . తన వాడుక చొప్పున విశ్రాంతి దిన మందు సమాజమందిరము లోనికి వెళ్లి , చదువుటకై నిలుచుండగా
ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను ; ఆయన గ్రంథము విప్పగా --
ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను , గ్రుడ్డివారికి చూపును , (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును
ప్రభువు హిత వత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు . అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను .
ఆయన గ్రంథము చుట్టి పరిచారకుని కిచ్చి కూర్చుండెను .
సమాజమందిరము లో నున్న వారందరు ఆయనను తేరిచూడగా , ఆయననేడు మీ వినికిడి లో ఈ లేఖనము నెరవేరినదని వారి తో చెప్ప సాగెను .
అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు , ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా ? అని చెప్పుకొనుచుండగా
ఆయన వారిని చూచి వైద్యుడా , నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి , కపెర్నహూము లో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో , ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను .
మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వ దేశ మందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను .
ఏలీయా దినముల యందు మూడేం డ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమం దంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు , ఇశ్రాయేలు లో అనేకమంది విధవరాండ్రుం డినను ,
ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడ లేదు .
మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలు లో అనేక కుష్ఠరోగులుం డినను , సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొంద లేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను .
సమాజమందిరము లో ఉన్నవారందరు ఆ మాటలు విని
ఆగ్రహముతో నిండుకొని , లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి , ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటువరకు ఆయనను తీసికొని పోయిరి.
అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను .