నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు.
ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.
కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.
మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును ; నీవు వాటిని నమ్మ లేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట లాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను .
ప్రజలు జెకర్యా కొరకు కనిపెట్టుచుండి , ఆలయము నందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి .
అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున , ఆలయము నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి ; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు , మూగవాడై యుండెను .
గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.
అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడియున్నారు.
పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు చేసెను దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయి యున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట లేదు.
ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను , వానిని ఆలాగుననే యుండనిమ్ము .
అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు ; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు .
రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును ; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు .
కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రము వరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొర కదు ;
మీకు దర్శనము కలుగకుండ రాత్రికమ్మును , సోదెచెప్పకుండ మీకు చీకటి కలుగును; ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమించును , పగలు చీకటిపడును
అప్పుడు ధీర్ఘదర్శులు సిగ్గునొందుదురు , సోదెగాండ్రు తెల్లబోవుదురు . దేవుడు తమకు ప్రత్యుత్తర మియ్యకుండుట చూచి నోరు మూసి కొందురు .
ఆయన నాతో ఇట్లనెను నర పుత్రుడా , నా మీద తిరుగుబాటుచేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను ; వారును వారి పితరులును నేటి వరకును నామీద తిరుగుబాటు చేసినవారు ."
వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై యున్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను , వారు తిరుగుబాటు చేయువారు
గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త యున్నాడని వారు తెలిసికొనునట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను .
నర పుత్రుడా , నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు ;
అయినను ఆ జనులకు భయ పడకుము , వారి మాటలకును భయ పడకుము . వారు తిరుగుబాటు చేయువారు వారికి భయ పడకుము .
వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము .
యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.