కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.
అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.
అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవిం చనివారెవరో మీరు తిరిగి కనుగొందురు .
అతని పేరు నాబాలు , అతని భార్య పేరు అబీగయీలు . ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియైయుండెను . అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతి వాడు.
నాబాలు గొఱ్ఱలబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని
తన పని వారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనెను -మీరు కర్మెలునకు నాబాలు నొద్దకు పోయి , నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి
ఆ భాగ్యవంతునితో -నీకును నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి యీ వర్తమానము తెలియజెప్పవలెను .
నీ యొద్ద గొఱ్ఱలబొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను ; నీ గొఱ్ఱకాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడునుచేసి యుండలేదు ; వారు కర్మెలులో నున్నంత కాలము వారేదియు పోగొట్టుకొన లేదు ;
నీ పనివారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు . కాబట్టి నా పనివారికి దయ చూపుము . శుభ దినమున మేము వచ్చితివిు గదా ; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము .
ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.
అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.
నీవు తినినను తినినదానిని కక్కివేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.