'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.
హితబోధ యాప్ కొరకు Join WhatsApp
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.
ఆదికాండము అధ్యాయము 31
ఈ అధ్యాయంలో మనం లాబాను ప్రవర్తన గమనించిన యాకోబు తన భార్యలతో జరిగిన సంగతులన్నీ వివరించడం (1-16) తన భార్యలు తనకు సానుకూలంగా స్పందించేసరికి లాబానుతో ఏమీ చెప్పకుండా యాకోబు పారిపోవడం (17-21) ఈ విషయం తెలుసుకున్న లాబాను యాకోబును తరమడం మార్గమధ్యంలో దేవుడతణ్ణి హెచ్చరించడం (22-24) లాబాను యాకోబులు ఇద్దరూ వాదించుకోవడం దొంగిలించబడిన గృహదేవతల గురించి లాబాను గాలించడం (25-42) ఇక లాబాను చేసేదేం లేక యాకోబుతో నిబందన చేసుకుని ఎవరిదారిన వారి వెళ్ళిపోవడం (43-55) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 32
ఈ అధ్యాయంలో యాకోబును దేవదూతలు ఎదుర్కోడం (1-2) తాను వస్తున్న విషయం ఏశావుకు తెలియచెయ్యడం (3-5) ఏశావు తనదగ్గరకు నాలుగువందలమందితో వస్తున్నాడనే సరికి భయపడడం (6-8) ఆ భయంతో దేవునికి ప్రార్థించడం (9-12) తన అన్నను సమాధాన పరచడానికి కానుకను పంపించడం (13-23) యెహోవా దూత నరుడిగా వచ్చి అతనితో పెనుగులాడడం, యాకోబు అతనిని గెలవనివ్వకుండడం చూసి తొడగూటి నరంపైకొట్టడం (24-25) చివరికి ఆయన యాకోబును ఆశీర్వదించడం (26-32) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 33
ఈ అధ్యాయంలో ఏశావు నాలుగువందల మందితో యాకోబును ఎదుర్కోవడం (1-1) యాకోబు తన కుటుంబాన్ని వరుసక్రమంలో ఉంచి తన అన్నముందు సాగిలపడడం (2-3) ఏశావు యాకోబులు ఇద్దరూ సమాధాన పడడం (4-7) యాకోబు చేసిన బలవంతం మీద ఏశావు కానుకను స్వీకరించడం (8-11) యాకోబు తనవెంట తరువాత వస్తానని చెప్పినమాటకు ఏశావు సమ్మతించి అక్కడినుండి వెళ్ళిపోవడం (12-16) యాకోబు ఏశావుకు చెప్పినట్టే శెయీరుకు వెళ్ళివచ్చిన తరువాత సుక్కోతులో నివసించి అక్కడ ఒక స్థలం కొని బలిపీఠం కట్టడం (17-20) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 34
ఈ అధ్యాయంలో దీనా షెకెము కుమారుడి చేతిలో బలవంతం చేయబడడం (1-2) తరువాత ఆమెను వివాహం చేసుకోవాలి అనుకోవడం (3-4) ఈ విషయం తెలిసి యాకోబు కుటుంబం సంతాపపడడం (5-7) షెకెము తండ్రి ఆ వివాహం కోసం దేనినైనా చెల్లించడానికి సిద్ధపడడం (8-12) యాకోబు కుమారులు వారిని కపటంగా చంపదలచి సున్నతిని అడ్డుపెట్టుకోవడం (13-17) షెకెము అతని తండ్రి వారిమాటలకు సమ్మతించి తమతో పాటు ఆ ఊరివారందరూ సున్నతిపొందేలా ప్రేరేపించడం (18-24) ప్రణాళిక ప్రకారం యాకోబు కుమారులైన లేవీ షిమ్యోనులు ఆ ఊరి పురుషులందరినీ చంపి వారి సమస్తాన్నీ దోచుకోవడం (25-29) యాకోబుకు అది తెలిసి తన కుమారులతో వాదించడం (30-31) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 35
ఈ అధ్యాయంలో దేవుడు యాకోబుకు బేతేలుకు వెళ్ళమని ఆజ్ఞాపించడం (1-1) యాకోబు దాని గురించి తనతో ఉన్నవారిని సిద్ధం చెయ్యడం (2-4) వారు షెకెము నుండి బేతేలుకు దేవునికాపుదలతో ప్రయాణించి అక్కడ బలిపీఠం కట్టడం (5-7) రిబ్కా దాది చనిపోయి పాతిపెట్టబడడం (8) దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఆశీర్వదించడం (9-15) బెన్యామీనును కని రాహేలు చనిపోవడం (16-20) రూబేను హేయమైన క్రియను చెయ్యడం (21-22) యాకోబు కుమారుల పేర్లను గ్రంథకర్త వివరించడం (23-26) ఇస్సాకు మరణించడం (27-29) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 36
ఈ అధ్యాయంలో ఏశావు భార్యల పేర్లు (1-3) అతని వంశావళి (4-43) మరియు యోబు దేశమైన ఊజు గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 37
ఈ అధ్యాయంలో యాకోబు దేవునిమాట ప్రకారం కనానులో నివసిస్తూ యోసేపును తన మిగిలిన కుమారులకంటే ఎక్కువగా ప్రేమించడం (1-4) యోసేపు కలలను కని తన సహోదరులకూ తండ్రికీ తెలియచెయ్యడం (5-11) యోసేపు అన్నలు అతనిపై పగబట్టి అతడిని ఇష్మాయేలీయులకు అమ్మివెయ్యడం (12-28) వారు తమ తండ్రిని యోసేపును ఒక మృగం తినివేసిందని నమ్మించడం (29-35) ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తుకు అమ్మివెయ్యడం (36) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 38
ఈ అధ్యాయంలో యూదా ఒక కనానీయురాలి ద్వారా ముగ్గురు కుమారులను కనడం (1-5) జ్యేష్ఠకుమారుడికి తామారు అనే స్త్రీతో వివాహం చేసినపుడు అతడు చనిపోవడం (6-7) రెండవ కుమారుడు చేసిన పనివల్ల అతను కూడా చనిపోవడం (8-10) యూదా భయపడి తన చిన్నకుమారుడిని తామారుకు ఇవ్వకుండా మోసగించడం (11) తరువాత యూదా తామారును వేశ్య అనుకుని ఆమెతో వ్యభిచరించడం (12-23) తామారు యూదా వల్ల గర్భవతి అయినపుడు అతను ఆమె వ్యభిచారం చేసిందని భావించి ఆమెను చంపాలనుకోవడం తరువాత అది తనవల్లే జరిగిందని తెలుసుకుని పశ్చాత్తాపపడడం (24-26) ఆమె అతనికి ఇద్దరు కుమారులను కనడం (27-30) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 39
ఈ అధ్యాయంలో యోసేపును ఇష్మాయేలీయిలు పోతిఫరుకి అమ్మివెయ్యడం, యెహోవా యోసేపుకు తోడైయుండి పోతిఫరు ఇంటికి దీవించడం (1-6) పోతిఫరు భార్య యోసేపుపై కన్నువేసి అతనిని వ్యభిచారానికి ప్రేరేపించడం యోసేపు దానికి ఒప్పుకోవకపోవడం (7-10) ఒకరోజు ఆమె యోసేపును బలవంతంగా ప్రేరేపించి అతను ఒప్పనందుకు అతనిపై అత్యాచార ఆరోపణ మోపడం (11-18) పోతిఫరు యోసేపును చెరశాలలో వేయించడం, యెహోవా అక్కడ కూడా అతనికి తోడైయుండడం (19-23) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 40
ఈ అధ్యాయంలో ఫరో తన ఇద్దరు ఉద్యోగస్తులను యోసేపు ఉన్న చెరశాలలో వేయించడం (1-3) యోసేపు వారికి ఉపచారం చేసేవాడిగా ఉన్నపుడు వారిద్దరికీ కలలు రావడం (4-7) తరువాత యోసేపు ఆ కలలను తెలుసుకుని వాటి భావాన్ని వివరించడం (8-19) యోసేపు చెప్పిన కల భావాల చొప్పున వారికి జరగడం పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోవడం (20-23) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 41
ఈ అధ్యాయంలో ఫరో ఒక కలను కనడం (1-7) ఆ కల గురించి కలవరానికి లోనైనపుడు పానదాయకుల అధిపతి యోసేపు గురించి తెలియచెయ్యడం (8-13) ఫరో యోసేపును చెరశాల నుండి విడుదల చెయ్యించి అతనికి తన కలను వివరించడం యోసేపు దానికి భావం చెప్పడం (14-32) యోసేపు ఫరోకు కలభావాన్ని మాత్రమే కాకుండా ఆ కరవునుండి తప్పించుకునే ఉపాయాన్ని కూడా చెప్పినపుడు ఫరో అతడిని ఐగుప్తుకు ప్రధానిగా నియమించి వివాహం కూడా జరిపించడం (33-45) యోసేపు ఆ బాధ్యతలు స్వీకరించి ధాన్యాన్ని సేకరించడం (46-49) దేవుడు అతనికి ఇద్దరు కుమారులను అనుగ్రహించడం (50-52) యోసేపు చెప్పినట్టుగానే అ దేశంలో కరవు తాండవించడం (53-57) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 42
ఈ అధ్యాయంలో ఐగుప్తులో ధాన్యం ఉందని యాకోబు తెలుసుకుని తన కుమారులను అక్కడికి పంపించడం (1-5) వారు ఐగుప్తులో ధాన్యం కొనబోయినపుడు యోసేపు వారిని గుర్తు పట్టి కఠినంగా వ్యవహరించడం (6-9) వారు తమ కుటంబ వివరాలను యోసేపుకు తెలియచేసినపుడు అతడు బెన్యామీనును ఐగుప్తుకు తీసుకువస్తేనే కానీ మీరు ఇక్కడినుండి వెళ్ళకూడదని చెప్పడం (10-17) తరువాత యోసేపు వారిముందు మరో ప్రత్యామ్నాయం పెడుతూ షిమ్యోనును మాత్రమే అక్కడ బంధించి మిగిలినవారిని యాకోబు దగ్గరకు పంపించడం (18-26) వారి గోనెల్లో యోసేపు రూకలు వేయించినపుడు వారు అవి చూసి భయానికి లోనవ్వడం (27-28) వారు యాకోబుతో జరిగిన విషయమంతా వివరించినపుడు అతను జరిగేదంతా తనకు ప్రతికూలంగా జరుగుతుందని భావించి బెన్యామీనును వారితో పంపడానికి ఇష్టపడకపోవడం (29-38) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 43
ఈ అధ్యాయంలో ఐగుప్తునుండి యోసేపు సోదరులు తెచ్చిన ఆహారం అయిపోయినపుడు యాకోబు మరలా వారిని ఐగుప్తుకు పంపడానికి ప్రయత్నించడం (1-2) యూదా దానికి నిరాకరిస్తూ బెన్యామీనును మాతో పంపితేనే కానీ మేము వెళ్ళలేమని ఉత్తరమివ్వడం (3-5) ఆ మాటలకు యాకోబు చింతించడం, యూదా అతడిని సముదాయించడానికి ప్రయత్నించడం (6-10) చివరికి యాకోబు ఆ మాటలకు ఒప్పుకుని ఐగుప్తుకు బెన్యామీనుతో పాటు యోసేపుకోసం కానుకను పంపించడం (11-15) యోసేపు బెన్యామీనును చూసి వారందరినీ భోజనం నిమిత్తం తన ఇంటికిపంపడం అతని సహోదరులు భయపడడం (16-25) భోజనం సమయంలో యోసేపు వారిని కలుసుకుని వారితో కలసి భోజనం చెయ్యడం (26-34) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 44
ఈ అధ్యాయంలో యోసేపు తన అన్నల ధాన్యపు సంచులలో వారు తెచ్చిన ధనాన్నీ, బెన్యామీను సంచిలో అయితే వెండిగిన్నెను కూడా పెట్టించడం (1-3) యోసేపు ఆజ్ఞాపించినట్టుగా గృహనిర్వాహకుడు వారిని కలసుకుని పకలడం (4-6) అయితే యోసేపు అన్నలు తాము దొంగిలించలేదని వాదిస్తూ వారి గోనెలను అతనికి చూపించడం బెన్యామీను పట్టబడడం (7-12) వారు ఆ విషయంలో వేదనకులోనై యోసేపు దగ్గరకు వచ్చి బెన్యామీనుకోసం వేడుకోవడం యోసేపు దానికి ఒప్పుకోకపోవడం (13-17) అప్పుడు యూదా తనకూ యాకోబుకూ జరిగిన సంభాషణ అంతా యోసేపుకు తెలియచేసి బ్రతిమిలాడుకోవడం (18-34) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 45
ఈ అధ్యాయంలో యోసేపు తన సహోదరులకు తనగురించి తెలియచేసుకుని ఏడ్వడం (1-4) తాను ఐగుప్తుకు అమ్మివెయ్యబడడం దేవుని నిర్ణయమని వారిని ఓదార్చడం (5-8) తరువాత అతను యాకోబును ఐగుప్తుకు తీసుకురావడానికి వారిని ప్రేరేపించడం అందుకు ఫరో ఒప్పుకోవడం (9-20) అతని సహోదరులు యోసేపు మాటచొప్పున యాకోబు దగ్గరకు వెళ్ళి అతని గురించి తెలియచెయ్యడం (21-26) తరువాత యాకోబు ఆనందంతో యోసేపు దగ్గరకు వెళ్ళడానికి ఆరాటపడడం గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 46
ఆదికాండము అధ్యాయము 47
ఈ అధ్యాయంలో యోసేపు కుటుంబం ఐగుప్తుకు రావడం (1-2) వారిని యోసేపు ఫరోముందు హాజరు పరచడం (3-6) యాకోజు ఫరోను దీవించడం (7-10) యోసేపు తన కుటుంబానికి ఆహారమిచ్చి సంరక్షించడం (11-12) ఐగుప్తులో కరవు భారమైనపుడు ఆ ప్రజలు యోసేపు దగ్గర ఆహారంకోసం విన్నవించుకోవడం (13-26) యాకోబు తన సమాధి గురించి యోసేపుతో ప్రమాణం చేయించుకోవడం (27-31) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 48
ఈ అధ్యాయంలో యాకోబు మరణసమయం సమీపించిందని తెలుసుకున్న యోసేపు తన కుమారులతో వెళ్ళి అతనిని దర్శించడం (1-2) యాకోబు అతనితో వాగ్దానం గురించి జ్ఞాపకం చెయ్యడం (3-4) యోసేపు కుమారులు ఇద్దరినీ తన కుమారులుగా దత్తతు తీసుకోవడం (5-6) రాహేలు మరణం గురించి అతను జ్ఞాపకం చేసుకోవడం తరువాత మనష్షే ఎఫ్రాయీములను దీవించడం (7-20) వారి ఐగుప్తు విడుదల గురించి ప్రవచించడం యోసేపుకు ఆస్తిలో ఒక భాగం ఎక్కువ ఇవ్వడం (21-22) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 49
ఈ అధ్యాయంలో యాకోబు తన కుమారుల భవిష్యత్తు గురించి ప్రవచిస్తూ రూబేను గురించీ (1-4) షిమ్యోను లేవీల గురించి (5-7) యూదా గురించి (8-12) జెబులూను ఇశ్శాఖారుల గురించీ (13-15) దాను గురించీ (16-19) ఆషేరు నప్తాలీల గురించి (20-21) యోసేపు బెన్యామీనుల గురించి తెలియచెయ్యడం (22-27) తరువాత యాకోబు మరణించి సమాధి చెయ్యబడడం (28-33) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 50
ఈ అధ్యాయంలో యాకోబు మరణించడం అతడి దేహాన్ని సుగంధద్రవ్యాలతో సిద్ధపరచడం (1-3) యోసేపు ఫరో అనుమతితో ఆ దేహాన్ని కానానుకు తీసుకువెళ్ళి అక్కడ సమాధిచెయ్యడం (4-13) తరువాత యోసేపు సహోదరులు అతనిపై ఉన్న అనుమానంతో అబద్ధం చెప్పడం దానికి యోసేపు బాధపడడం (14-21) చివరిగా యోసేపు తన ఎముకలను కానానులో పాతిపెట్టాలని ప్రమాణం చేయించుకుని చనిపోవడం అతని దేహాన్ని ఐగుప్తులో ఒక పెట్టెలో ఉంచడం (22-26) గురించి మనం చదువుతాం.
Page 2 of 2